అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు నివేదికను ఈ నెల 23వ తేదీలోపు సీల్డ్ కవర్లో అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన వైఎస్ వివేకా హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి ఇవ్వాలని కోరుతూ పులివెందుల టిడిపి నేత బిటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 2020 జనవరి మూడవ తేదీకి వాయిదా వేసింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న పులివెందులలోని వైఎస్ వివేకానంద స్పగృహంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును సిట్ బృందం దర్యాప్తును చేస్తున్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?