అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జనవరి ఏడులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 7న మధ్యాహ్నం 2 గంటల్లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ వివరాలతో 8న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
previous post
next post