(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి క్రిమినల్ కేసు నుండి విముక్తి లభించింది. ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు క్వాష్ చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని ఏలూరు రంగారెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో సోమిరెడ్డిపై ఫోర్జరీ, ట్రెస్ పాస్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోమిరెడ్డి నాలుగు గంటల పాటు పోలీసు విచారణను ఎదుర్కొన్నారు. విచారణ సమయంలో భూములకు సంబంధించి 1933 నుండి ఆయన వద్ద ఉన్న పత్రాలను పోలీసులకు, మీడియాకు చూపించారు. తన వద్ద ఉన్న ఆధారాలను జత చేస్తూ సోమిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిగిన కోర్టు కేసును క్వాష్ చేసింది,