టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయ విజయ్ కి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. విజయ్ పై నమోదైన కేసులో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఏపి సీఐడీకి సూచించింది. సీఎం వైఎస్ జగన్ భారతిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టిన వ్యవహారంలో ఏపి సీఐడీ పోలీసులు విజయ్ పై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22వ తేదీన ఏపీ సీఐడీ పోలీసులు మరో సారి విజయ్ కు 41(ఏ) నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి నోటీసులు అంటించారు.
ఈ నోటీసును విజయ్ తరపు న్యాయవాది హైకోర్టులో సవాల్ చేశారు. గురువారం హైకోర్టులో విజయ్ తరపు న్యాయవాది, ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ నివాసం నర్సీపట్నం లో ఉంటే హైదరాబాద్ లో నోటీసులు ఇవ్వడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఐటీడీపీ కోసం ఉపయోగిస్తున్న గాడ్జెట్స్ ను తేవాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా, ఐటీడీపీతో తమకు సంబంధం లేదని విజయ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు .. ఈ కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది.
ఆ కుటుంబాలకు వచ్చే నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్