(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒ హెబియస్ కార్బస్ పిటిషన్ విచారణ సందర్భంలో ఏపిలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందన్న తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపడింది.
అమలాపురం మండలం ఇందుగుపల్లికి చెందిన వెంకట రాజు అదృశ్యంపై బాధితుడి మేనమామ సుంకర నారాయణ స్వామి హైకోర్టులో హెబియస్ కార్బస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంలో హైకోర్టు..వెంకట రాజు విషయంలో పోలీసుల తీరును తప్పుబట్టింది.
గతంలో మూడు కేసుల్లో జ్యూడిషియల్ విచారణ జరిపితే పోలీసులదే తప్పని తెలిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని వ్యాఖ్యానించింది ధర్మాసనం. ప్రతి కేసులోనూ సిబిఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో పలు పర్యాయాలు డీజీపీని కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదనీ, ఆయన పోలీస్ వ్యవస్థను నియంత్రించడంలో విఫలం అవుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.