AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టు మరో సారి షాక్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయనగరం జిల్లా మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ల చైర్ పర్సన్ గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ జివో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు విచారణ జరిగింది.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పుఇచ్చింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా పునర్నియమించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం లక్ష్మీనర్శింహస్వామి దేవస్థానాలకు తిరిగి చైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?