కరోనా కారణంగా జీతాలు కోత పెట్టిన సర్కారుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో 50% కోత పెట్టిన పెన్షన్లు, జీతాలను 12% వడ్డీ తో చెల్లించాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
విశాఖపట్నం కి చెందిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దీన్ని ఏపీ ప్రభుత్వం అసలు ఊహించలేదు. ఆ రెండు నేలల్లోనూ కరోనా కష్టకాలం అంటూ ఉద్యోగుల జీతాల్లో సగం తగ్గించారు. సుమారుగా రూ. 1500 కోట్ల వరకు ఉంటుంది. తాజాగా కోర్టు ఉత్తర్వులతో రూ. 1700 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అసలే ఆదాయం లేక, వాస్తవిక జీతాలే ఇవ్వలేని స్థితిలో ఉన్న ఏపీ ఖజానాకు ఇది మరింత దెబ్బ.