చిత్తూరు: కల్కి భగవాన్ ఆశ్రమాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ దీనిపై స్పందించారు. ఆశ్రమం పేరుతో కల్కి భగవాన్ అక్రమ ఆస్తులను కూడబెట్టారని సురేష్ ఆరోపించారు. హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసేలా కల్కి ఆశ్రమం పని చేస్తోందనీ, ఆశ్రమం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలని ఆయన అన్నారు. కల్కి భగవాన్ ఏమయ్యారో ప్రజలకు తెలియజేయాలనీ, ఆయనకు సంబంధించి అధారాలు వెంటనే బయటపట్టాలని సురేష్ కోరారు.
కల్కి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని సురేష్ చెప్పారు. ఐటి అధికారుల తనిఖీల్లో 33 కోట్ల రూపాయల విలువైన నగదు పట్టుబడిందనీ, అందులో 24 కోట్ల రూపాయలు భారత కరెన్సీ, తొమ్మిది కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ ఉందని సమాచారం.