వై సీ పీ రెబల్ ఎంపి రఘు రామ కృష్ణం రాజు గత కొద్ది రోజులుగా స్వరం పెంచి మరీ సొంత పార్టీని, ప్రభుత్వ పని తీరును తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు పార్టీ ఆయనను సస్పెండ్ అయితే చేయ లేదు కానీ అయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ విజయసాయి రెడ్డి నేతృత్వంలో వై సీ పీ ఎం పి ల బృందం స్పీకర్ ఓం బిల్లా కు ఇటీవల పిర్యాదు అందజేశారు.
అనంతరం రఘు రామకృష్ణం రాజు ఏపి ప్రభుత్వంపై విమర్శల స్వరం మరింత పెంచారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి జగన్ ప్రభుత్వంపై పిర్యాదు చేస్తూ వినతి పత్రం ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు రఘు రామకృష్ణం రాజు వ్యాఖ్యలను అంతగా పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.
ఇప్పుడు రఘు రామ కృష్ణం రాజు వ్యవహార శైలిపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా మండి పడ్డారు. రఘు రామకృష్ణం రాజుకి ఎంపి పదవి జగన్ పెట్టిన బిక్ష, జగన్ ఇమేజ్ తోనే అయన ఎంపి అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు అవంతి. నర్సాపురం నియోజకవర్గం వరకే అయన పరిమితం కావాలని అవంతి సూచించారు.
పార్టీ విధానాలు నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చు, ఎవరు ఆపేవాళ్లు లేరని అన్నారు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ని గానీ, సీఎం జగన్ ను విమర్శిస్తే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరించారు అవంతి. అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పడానికి అయన ఎవరు అంటూ రఘు రామకృష్ణం రాజుపై అవంతి మండిపడ్డారు. అవంతి వ్యాఖ్యలపై రఘు రామకృష్ణం రాజు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?