అమరావతి : ఈఎస్ఐలో జరిగిన భారీ అవినీతిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామనీ, విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామనీ మంత్రి జయరాం తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని ఆయన ఆరోపించారు. అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖే సాక్ష్యమని తెలిపారు. అక్రమంగా చెల్లించిన సొమ్ము రికవరీ చేస్తామని అయన పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని మంత్రి జయరాం తెలిపారు.
previous post