(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
ఏపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. సామాన్యులు మొదలు కొని సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు, నేతలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఏపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికు కరోనా పొజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఆదిమూలపు సురేష్, తరువాత పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం కరోనా బారిన పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాల్ల పాల్గొన్నారు. కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ పెద్దరెడ్డి పేర్కొంటూ తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా పరీక్షలు చేయించుకుని వైద్యం పొందాల్సిందిగా సూచించారు.