జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరులో వింత వ్యాధి వస్తుందని తనకి ఇన్ఫర్మేషన్ ఉందని కానీ మంత్రి ఎందుకు స్పందించలేదు చేసిన వ్యాఖ్యలను తాజాగా ప్రముఖ ఛానల్ యాంకర్ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దగ్గర ప్రస్థావించారు.
ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. నెల రోజుల ముందే పవన్ కళ్యాణ్ కి ఈ వ్యాధి ఏలూరులో వస్తుందని ఆయన చెబుతూ ఉన్నారంటే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోడానికి మాకు కొంచెం టైం పడుతుంది, అదే అర్థం చేసుకున్న తర్వాత తిరిగి మీకు సమాధానం చెబుతానని అన్నారు.
ఎప్పుడో నెల క్రితమొ సంవత్సరం క్రితమొ ఏలూరులో ఈవ్యాధి వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు, ముందుగానే అప్రమత్తమయి తన పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు ఆయన చెబుతున్న వ్యాఖ్యలు మేము అర్థం చేసుకోవాలి దానికి టైం పడుతుంది తర్వాత సమాధానం ఇస్తానని ఎటకారంగా ఆళ్ల నాని యాంకర్ వేసిన ప్రశ్నకు కౌంటర్ వేశారు. ఇక కరోనా వ్యాక్సిన్ విషయం గురించి యాంకర్ ప్రశ్నించగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అలర్ట్ గా ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ అందించే విషయంలో రాష్ట్ర స్థాయి అధికారులను స్వచ్ఛంద సంస్థలను కూడా అందుబాటులోకి తీసుకొస్తూ అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు.. వ్యాక్సిన్ అందరికీ అందేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని క్లారిటీ ఇచ్చారు.