ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో సంక్రాంతి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఏపీ మంత్రి తానేటి వనిత కాన్వాయ్ లోని వాహనం ఢీకొని కలసూరి వెంకటరామయ్య అనే వృద్ధుడు మరణించాడు. భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో వెంకటరామయ్య బైక్ పై వెళుతుండగా మంత్రి కాన్వాయ్ లోని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో ఆ బైెక్ అదుపు తప్పింది. ఆ వెనకాలే వచ్చిన మంత్రి ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు కూడా బైక్ను ఢీకొట్టి అనంతరం డివైడర్పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. మంత్రి తానేటి వనితకి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు వెంకటరామయ్య స్వస్థలం భీమవరం అని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
previous post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?