అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా కొద్ది రోజుల్లో మోగనున్నది. డిసెంబర్ 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశారు జారీ చేశారు. జనవరి పదవ తేదీన రిజర్వేషన్ల జాబితా ఖరారు చేస్తే మరుసటి రోజు నుండే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. వార్డు మెంబర్కు తెలుపు రంగు, సర్పంచ్ ఎన్నికకు గులాబి రంగు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్నారు.
సాధారణంగా సంక్రాంతి పండుగకు పల్లెల్లో సందడి నెలకొంటుండగా పంచాయతీ ఎన్నికల కారణంగానే నూతన సంవత్సర వేడుకలకు ముందు నుండే పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంటున్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?