AP Police: ఏపి ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్రంలో ఒకే సారి 53 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఇంత మందిని ఒకే సారి బదిలీ చేయడం విశేషం. దాదాపు ఏడాది పాటు వెయిటింగ్ ల కోసం వేచి ఉన్న సుమారు 17 మంది డీఎస్పీలకు మోక్షం లబించింది. వారికి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీలు ఇలా…
ఏ నరసింహమూర్తి విజిలెన్స్ నుండి విశాఖ వెస్ట్ ఏసీపీగా, మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్చారి నరసాపురం డీఎస్పీగా, నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీగా, ఎన్.సుధాకర్రెడ్డి చిత్తూరు నుండి పలమనేరు, ఎం.రాజగోపాల్రెడ్డి గూడూరు నుండి నాయుడుపేటకు,. వెయిటింగ్ లో ఉన్న.ఎన్.సురేష్కుమార్ రెడ్డి విజయవాడ ట్రాఫిక్ ఏసీపీగా, జి.వీరరాఘవరెడ్డి డీఎస్పీ అనంతపురం నుండి అనంతపురం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు, ఎం.వెంకట రమణ తిరుపతి స్పెషల్ బ్రాంచ్ నుండి కావలి డీఎస్పీగా, అశోక్కుమార్ గౌడ్ ఇంటలిజెన్స్ నుండి నూజివీడుకు, పి.మురళీకృష్ణా రెడ్డి కాకినాడ ట్రాఫిక్ నుండి కాకినాడ డీఎస్పీగా, కే శ్రీనివాసమూర్తి సీసీఎస్, చిత్తూరు నుండి చిత్తూరు డీఎస్పీగా, నాగుల రమ్య పెనుకొండ నుండి ఏసీబీ డీఎస్పీగా, టీడీ యశ్వంత్ పుత్తూరు నుండి పుట్టపర్తికి, సీహెచ్ వివేకానంద 14 బెటాలియన్ నుండి విశాఖ దిశా డీఎస్పీగా, ఎన్.కోటారెడ్డి స్పెషల్ బ్రాంచ్ నెల్లూరు నుండి ఆత్మకూరు డీఎస్పీగా, ఎం.కమలాకర్రావు సీసీఎస్.పలనాడు నుండి ఇంటలిజెన్స్ డీఎస్పీగా, వెయిటింగ్ లో ఉన్న వై.ప్రసాదరావు ను ఇంటలిజెన్స్ డీఎస్పీగా, ఎం.నాగభూషణం 2 బెటాలియన్ నుండి కర్నూలు ట్రాఫిక్ కు, సీ.మహేశ్వరరెడ్డి స్పెషల్ బ్రాంచ్ నంద్యాల నుండి నంద్యాల ఎస్డీపీఓగా, ఐ.సుధాకర్రెడ్డి కర్నూలు విజిలెన్స్ నుండి ఆళ్లగడ్డ ఎస్డీపీఓగా బదిలీ అయ్యారు.
వెయిటింగ్ లో ఉన్న కెవి రమణ కొత్తపేట ఎస్డీపీఓగా, డి.శ్రీనివాసరెడ్డి రాజమండ్రి స్పెషల్ బ్రాంచ్ నుండి నెల్లూరు టౌన్ ఎస్డీపీఓగా, డాక్టర్ బి రవికిరణ్ వెయిటింగ్ నుండి విజయవాడ సౌత్ ఏసీపీగా, .బి.శ్రీనివాసులు నూజివీడు నుండి కళ్యాణదుర్గం ఎస్డీపీఓగా, ఎం.సూర్యనారాయరెడ్డి వెయిటింగ్ నుండి గూడూరు ఎస్డీపీఓగా, హుస్సేన్ పీరా విజిలెన్స్ నుండి పెనుకొండ ఎస్డీపీఓగా, విక్రం శ్రీనివాసరావు వెయిటింగ్ నుండి ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీగా, వై.హరనాద్రెడ్డి నెల్లూరు రూరల్ నుండి టెక్కలి ఎస్డీపీఓగా, బీ ఆదినారాయణ వెయిటింగ్ నుండి ఎసీపీ,సీసీఎస్, విజయవాడకు, ఏ.సురేంద్రరెడ్డి ఇంటలిజెన్స్ నుండి తిరుపతి స్పెషల్ బ్రాండ్ డీఎస్పీ తిరుపతికి, డీఎస్ఆర్ వీఎస్ఎన్ మూర్తి సీసీఎస్, అనకాపల్లి నుండి విశాఖ ఈస్ట్ ఏసీపీగా, వెయిటింగ్ లో ఉన్న ఎం రమేష్ మైలవరం ఎస్డీపీఓగా, ఎన్.సుధాకర్ కడప ఎస్సీ,ఎస్టీ సెల్ నుండి ఎస్సీ,ఎస్టీసెల్ అన్నమయ్య జిల్లాకు, అక్కడ ఉన్న కె రవికుమార్ నగిరి ఎస్డీపీఓగా, జి ప్రసాద్రెడ్డి అనంతపురం ఎస్డీపీఓగా, వెయిటింగ్ లో ఉన్న టీ త్రినాథ్ ను విశాఖ సౌత్ ఏసీపీగా, ఎస్ఆర్సీ హర్షిత ఏసీపీ,ఈస్ట్ వైజాగ్ ను డీఎస్పీ దిశా సెల్ పార్వతిపురం మన్యం జిల్లాకు, టి మురళికృష్ణ రైల్వే, నెల్లూరు నుండి రేపల్లె ఎస్డీపీఓగా, పి.మల్లిఖార్జునరావు ఒంగోలు ట్రాఫిక్ నుండి నెల్లూరు రైల్వే (డీఎస్ఆర్పీ)కి, వి రమణకుమార్ కడప, పోలీస్ కాలేజ్ నుండి ఎస్సీ, ఎస్టీ సెల్ తిరుపతికి, వెయిటింగ్ లో ఉన్న షేక్ షర్ఫుద్దీన్ ను ఎస్సీ, ఎస్టీసెల్ పలనాడు డీఎస్పీగా, డి శ్రావణ్కుమార్ ను డీఎస్పీ డీటీసీ చిత్తూరుకు, జివి కృష్ణారావును పాలకొండ ఎస్డీపీఓగా, రఘువీర్ విష్ణును డీఎస్పీ ఎస్సీ,ఎస్టీ సెల్ చిత్తూరుకు, ఎం వెంకటేశ్వర్లును దిశా సెల్, విజయనగరంకు, వల్లూరి శ్రీనివాసరావు ను ఆర్ఎస్టీఎఫ్, అన్నమయ్య జిల్లాకు, బి.విజయకుమార్ ను స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీకాకుళంకు, జి.మురళీధర్ ను ఎస్సీ, ఎస్టీ సెల్, పార్వతిపురం మన్యం జిల్లాకు, సీహెచ్ సురేష్ను సీసీఎస్, తిరుపతికి, పివి మారుతిరావు ను డీఎస్పీ దిశా సెల్, నంద్యాలకు, విఎస్ఎన్ వర్మ ఏసీపీ, విజయవాడ సిటీ నుండి కొవ్వూరు ఎస్డీపీఓగా, బి శ్రీనాథ్ కొవ్వూరు నుండి భీమవరం ఎస్డీపీఓగా, సీహెచ్ రవికాంత్ స్పెషల్ బ్రాంచ్ నుండి విజయవాడ నార్త్ ఏసీపీగా బదిలీ అయ్యారు.