ఏపిలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గానూ మొత్తం అయిదు లక్షల మూడు వేల మంది ధరఖాస్తులు చేయగా, ఈ పోస్టుల భర్తీకి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 997 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ నియామక మండలి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ నియామక మండలి అభ్యర్ధులకు కచ్ఛితమైన నిబంధనలు పేర్కొంది. అభ్యర్ధులు సమయ పాలన పాటించాలి తెలిపింది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రానికి అనుమతించరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరుగుతుందని తెలిపారు.
అభ్యర్ధులకు ప్రధానమైన సూచనలు ఇవి
- అభ్యర్ధులు ఒక రోజు ముందుగానే తమ పరీక్షా కేంద్రాలను సందర్శించుకుని నిర్ధారించుకోవాలి.
- అభ్యర్ధులను ఆదివారం ఉదయం 9 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమితిస్తారు.
- ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోని అనుమతించరు.
- మొబైల్ ఫోన్, సెల్యూలర్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలను, రికార్డింగ్ పరికరాలు, కాలిక్యులేటర్ లాగ్ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోని అనుమతించరు. వీటిని పరీక్షా కేంద్రం వద్దకు కూడా తీసుకురాకూడదు. వాటిని భద్రపరిచేందుకు పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి ఏర్పాట్లు ఉండవు.
- అభ్యర్ధులు ఆథార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకుని రావాలి.
- హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకుని రావాలి.
డల్లాస్ (అమెరికా) లో తెలుగు వ్యక్తి అరెస్టు .. ఏ కేసులో అనేది తెలిస్తే అసహ్యించుకుంటారు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?