అమరావతి: ‘రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి’ అంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అనే పేరుతో టెండర్స్ రిజర్వ్ చేసుకుని.. రివర్స్ డెవలప్మెంట్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన,తుగ్లక్ పాలన నడుస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.చంద్రబాబుతో సహా నేతలు అసెంబ్లీకి రివర్స్ వాక్ చేస్తూ నిరసన తెలియజేశారు. నారా లోకేష్, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
previous post