Breaking: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పాస్ అయిన మహిళలు అంగన్ వాడి పోస్టులకు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాలలో అంగన్వాడి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ లు భారీగా రిలీజ్ చేస్తున్నారు. స్థానికంగా ఉండి పదవ తరగతి ఉత్తీర్ణులైన మహిళ.. ఉన్న ఊరిలోనే స్థానికంగా ఉద్యోగం చేసుకునేలా అభ్యర్థుల ఎంపిక జరగనుంది.
టెన్త్ పాస్ అయ్యి ఉన్న మహిళ వయసు జులై 1వ తారీఖు నాటికి 35 సంవత్సరాలు ఉండాలని… నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే సమయంలో 30 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అంగన్ వాడీ కార్యకర్త ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 11500 వేతనం చెల్లిస్తారు. ఇంకా మినీ అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు రూ. 7 వేలు, సహాయకురాలికి నెలకు రూ. 7 వేలు వేతనం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం దరఖాస్తు చివరితేదీ వచ్చే నెల 9 అని స్పష్టం చేసింది.