కరోనా నేపథ్యంలో నగదు రహిత సేవలు అందించేందుకు ఏపీ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ప్రథమ్ పేరుతో ఒక యాప్ ను సిద్ధం చేస్తోంది. దీని ద్వారా ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ముందుగా ప్రయోగాత్మకంగా 19 మేజర్ డిపోల్లో ఈ సేవలను ప్రవేశపెట్టనున్నారు.
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు-1, రాజమహేంద్రవరం, ఏలూరు, శ్రీకాకుళం-1, అనకాపల్లి, మచిలీపట్నం, విజయనగరం, గుంటూరు -1,2, అమలాపురం, రావులపాలెం, చిత్తూరు-2, తాడిపత్రిలలో ప్రథమ్ సేవలు ఈ నెల 20 నుండి అందుబాటులోకి వస్తాయి. దీని ప్రకారంగా ప్రయాణీకులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లాలో యాప్ లో ఎంటర్ చేయాలి. అక్కడ చూపించిన వివరాలు, సమయం బట్టి టికెట్ బుక్ చేసుకోవాలి. పిన్ నంబర్ డ్రైవర్ కు చెబితే సరిపోతుంది.