అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్లో వాస్తు లోపాలను అధికారులు గుర్తించారు. వాస్తు లోపాలను సరి చేసేందుకు నూతన ఛాంబర్ నిర్మాణం చేస్తున్నారు. ఆగ్నేయమూలలో ఉన్న సిఎస్ ఛాంబర్ను మరో చోటకు మారుస్తున్నారు. పాత ఛాంబర్ పక్కగా కొత్త ఛాంబర్ నిర్మాణం చేపడుతున్నారు. ఛాంబర్లోకి వెళ్లే ఒక ద్వారం మూసివేస్తున్నారు.
నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేడు సచివాలయానికి వెళ్లాలని భావించినా అక్కడ ఛాంబర్ నిర్మాణ పనుల జరుగుతున్న నేపథ్యంలో సచివాలయంకు వెళ్లకుండా తన నివాసం నుండే కార్యక్రమాలను కొనసాగించారు. తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి సారిగా సచివాలయంలో అడుగుపెట్టడానికి మంచి మూహూర్తం కూడా చూసుకున్నట్లు సమాచారం. ఆ ముహూర్తం ప్రకారం సచివాలయంలోకి జగన్ అడుగుపెట్టనున్నారు. ఈ లోపుగా సచివాలయం మొదటి బ్లాక్లో వాస్తు పరంగా మార్పులు చేస్తున్నారు.
సచివాలయ భవన నిర్మాణాల్లో వాస్తు లోపాలు ఉన్న కారణంగానే గత ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీచ్యుతుడయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో వాస్తు లోపాలను సరి చేస్తున్నారు.