అమరావతి: ఏపి రాజధాని అమరావతిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అమరావతి నుండి రాజధానిని తరలించడానికి వీలులేదనీ ఒక పక్క రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న తరుణంలో తమ్మినేని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వనున్నాయి. అమరావతిలో రాజధానికి వెళుతుంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్లుగా ఉందని తమ్మినేని వ్యాఖ్యానించారు. ‘రాజధాని నాది అని ప్రజలు భావించాలి కానీ అమరావతిలో అది నాకు కనిపించలేదు’ అని అన్నారు. సిఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తమ్మినేని పేర్కొన్నారు. విమర్శలు చేస్తున్న వారు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై కశ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
previous post