అమరావతి: శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ నేతలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశానికి పార్టీ నేతలు గైరుహాజరు అవ్వడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్లో శుక్రవారం శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఆ నియోజకవర్గ పరిధిలోని పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, ఆముదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు, నాయకులు హజరయ్యారు. అయితే శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే లక్మీదేవి కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందగా ఆమె సమావేశానికి హజరు కాలేదు. ఎమ్మెల్యే సమావేశానికి రాకపోవడంతో ఆ నియోజకవర్గ నేతలు సైతం గైరుహాజరు అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగంలో ముఖ్యమైన పాయింట్లు
- ప్రతి కార్యకర్త రాజకీయాలను అధ్యయనం చేసే స్థాయికి చేరాలి.
- రాష్ట్రానికి న్యాయం కోసమే టిడిపి ధర్మపోరాటం చేసింది.
- దేశ వ్యాప్తంగా బిజెపి వ్యతిరేక శక్తులను కూడగట్టాం.
- బిజెపికి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగాం.
- మోది వ్యతిరేక గాలిని దేశవ్యాప్తంగా ఉద్దృతం చేశాం
- ఓటమి నైరాశ్యంతోనే మోది చౌకబాబు వ్యాఖ్యలు
- అసహనంతోనే మోది దిగజారి మాట్లాడుతున్నారు.
- 26ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గురించి మాట్లాడుతున్నారు.
- గత ఐదేళ్లలో మోది ఏమి చేశారో చెప్పాలి.
- చెప్పేందుకేమీ లేనందునే మోది చౌకబాబు విమర్శలు చేస్తున్నారు.
- దేశానికి రాబోయేది కొత్త ప్రధానే
- మోది వల్ల భారత రాజకీయాల్లో హుందాతనం కొరవడింది.
- ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు, దిగజారుడు రాజకీయాలు గతంలో లేవు.
- మొదట్లో గుజరాత్ నమూనా అని మోది హోరెత్తించారు.
- ఇప్పుడు ఆ గుజరాత్ మోడల్ ఘోర వైఫల్యంగా తేలింది.
- హైదరాబాదు అభివృద్ధి ఎక్కడ, అహ్మదాబాద్ అభివృద్ధి ఎక్కడ?
- గుజరాత్ మోడల్ అనేది మోది సృష్టించిన శూన్యం తప్ప ఏమీ లేదు
- టిడిపితో పెట్టుకున్నప్పుడే మోదికి పతనం ప్రారంభమైంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?