2014 లో అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించిన టీడీపీ 2019 లో ఘోరంగా ఓడిపోయింది. అయితే.. ఏపీలో టీడీపీ ఓడిపోవడానికి కారణాలు అనేకం. ఏది ఏమైనా ఎక్కడైతే పోగొట్టుకుందో అక్కడే వెతుక్కోవడం టీడీపీ ప్రారంభించిందా? పూర్వ వైభవాన్ని తిరిగి పొందడం కోసం టీడీపీ కొత్త వ్యూహాలను రచిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పార్టీలో పూర్వ వైభవాన్ని నింపడం కోసం పార్టీ కొత్త వ్యూహాల్లో భాగంగా బీసీల వైపు చూస్తోంది. పార్టీలో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ.. బీసీ ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులుగా బీసీలకే 50 శాతం అవకాశాలు ఇచ్చింది. తాజాగా.. టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటును కూడా టీడీపీ చేస్తోంది. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా ఇప్పటికే అచ్చెన్నాయుడిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ఉత్తరాంధ్రకు తగిన ప్రాధాన్యం పార్టీలో ఇవ్వడంతో పాటు బీసీలకు పెద్ద పీఠ వెయ్యాలన్న ఉద్దేశంతో అచ్చెన్నకే ఈ పదవిని కట్టబెడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే బీసీల్లో బలమైన సామాజికవర్గం యాదవ వర్గానికి చెందిన బీద రవిచంద్రను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు చంద్రబాబు.
యాదవులను దగ్గర చేర్చుకునేందుకే టీడీపీ… రవిచంద్రకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. రవిచంద్ర ఇదివరకు నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు.
2019 లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలను వెతికే పనిలో పడిన చంద్రబాబు.. పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం.. కిందిస్థాయి నాయకులను…. సీనియర్ నాయకులు పట్టించుకోలేదు.. అని తెలుస్తోంది. అదే నిజమైతే… ఈసారి ఆ తప్పు మరోసారి చేయకూడదని.. అలాగే పార్టీలో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలని.. ముఖ్యంగా ఎక్కువ శాతం ఉన్న బీసీలకు పార్టీలో మరింత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీని పటిష్ఠ పరిచేందుకు… పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.