Manipur Violence: మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్ధులను మణిపూర్ రాజధాని ఇంపాల్ నుండి శంషాబాద్ తీసుకొచ్చారు. ఏపి, తెలంగాణకు చెందిన 178 మంది విద్యార్దులు ఒకే ఫ్లైట్ లో తీసుకుని వచ్చారు అధికారులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు సమన్వయంతో తరలింపు ప్రక్రియను చేపడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి విద్యార్ధులను వారి స్వస్థలాలకు పంపారు. దాదాపు 11 బస్సులను వీరి కోసం కేటాయించారు. ఇందులో ఏపికి ఏడు బస్సులు, తెలంగాణకు ఎనిమిది బస్సులలో విద్యార్ధులను వారి స్వస్థలాలకు పంపారు.
మొదటి ఫేజ్ లో ఇంపాల్ నుండి హైదరాబాద్ కు 178 మంది విద్యార్ధులను స్వస్థలాలకు తరలించారు. విద్యార్ధుల తల్లిదండ్రులు ఎవరు విమానాశ్రయానికి రావద్దు అని ముందుగానే సమాచారం ఇచ్చారు అధికారులు. విద్యార్ధులు క్షేమంగా వస్తుండటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.తొలుత ఆదివారం సాయంత్రానికే విద్యార్ధులను ప్రత్యేక విమానంలో తీసుకురావాల్సి ఉడంగా, అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో తరలింపు సోమవారం (నేటికి) వాయిదా పడింది. మణిపూర్ లో అల్లర్లు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి ఐఐటీతో పాటు ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న తెలుగు విద్యార్ధులను సురక్షితంగా తరలించేందుకు ఏపి, తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం శనివారమే అప్రమత్తమైంది. బాధితుల సహాయార్ధం ఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్ధులను ప్రత్యేక విమానంలో శంషాబాద్ తీసుకొచ్చామని తెలిపార. వారిని బస్సుల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్ధుల చదువులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పారు. మణిపూర్ లో పరిస్థితులు సాధారణ స్థాయికి రాకపోతే వాళ్ల చదువులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడే ఏదో ఒక ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఏపి సీఎం జగన్ సెక్రటరీ ముత్యాలరాజు మాట్లాడుతూ మణిపూర్ లో చిక్కుకుపోయిన ఏపి విద్యార్ధుల విషయంలో సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. రెండు ప్రత్యేక విమానాల్లో విద్యార్ధులను ఏపి ప్రభుత్వం తరలిస్తొందని చెప్పారు. విద్యార్ధులకు భోజన, రవాణా సదుపాయాలన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మణిపూర్ లో చిక్కుకున్న ఏపి విద్యార్ధులను రక్షించామనీ, ఈ ఆపరేషన్ పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మణిపూర్ సీఎస్ తో ఏపి ప్రభుత్వం టచ్ లో ఉందని తెలిపారు. కమర్షియల్ ఫ్లైట్ లో వారిని తీసుకురావాలంటే ఆలస్యం అవుతుందని, అందుకే స్పెషల్ ఫ్లైట్స్ పంపామని చెప్పారు. కోల్ కత్తా, హైదరాబాద్ లో దిగిన విద్యార్ధులను గమ్యస్థానాలకు చేరుస్తామని తెలిపారు. కొందరికి రెగ్యులర్ ఫ్లైట్స్ లో కూడా టికెట్ బుక్ చేశామనీ, వారిని ఎయిర్ పోర్టు నుండి కార్లలో స్వస్థలాలకు పంపుతామని చెప్పారు.
Tirumala: మొబైల్ ఫోన్ తో శ్రీవారి ఆలయంలోకి.. వీడియో వైరల్