ఎవరు ఊహించని విధంగా ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్ సి పరీక్షలు రద్దు అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది సేపటి ప్రెస్ తో మాట్లాడుతూ కొవిడ్ 19 నివారణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
మొదట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాగే వారి రాష్ట్రంలో కూడా పదవతరగతి పరీక్షలు రద్దు చేయగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిని కొనసాగిస్తామని చెప్పారు.అయితే రోజు వందల సంఖ్యలో పెరుగుతున్న కేసులు మరియు ఎక్కడా వైరస్ వ్యాప్తి తగిన ఆనవాళ్ళు కనపడకపోవటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంవత్సరం మొత్తం ఆరు లక్షల విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా వచ్చే నెల 10 నుంచి 15వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇక వీరిని ఇంటర్ కు ప్రమోట్ చేసేందుకు గ్రేడ్ల నే పరిగణిస్తారు అని విద్యా నిపుణులు భావిస్తున్నారు.