పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు, హీరో అన్న బంధం కంటే కూడా వ్యక్తిగతంగా ఇద్దరి మద్య ఉన్న సాన్నిహిత్యం గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. పవర్ స్టార్ పిలవగానే ఎలాంటి రెండవ ఆలోచన లేకుండా ఆయన ముందు వాలిపోతాడు త్రివిక్రం. కేవలం సినిమాల విషయంలోనే కాక రాజకీయాల కి సంబంధించిన వ్యవహారాలలోను త్రివిక్రం పవన్ కళ్యాణ్ కి ఫుల్ సపోర్ట్ గా ఉంటాడు.
ఇక పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తూ వరసగా నాలుగు సినిమాలు కమిటయ్యాడు. అయితే ఆ నాలుగు సినిమాలలో త్రివిక్రం సినిమా లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో వకీల్ సాబ్ చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
అలాగే శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మాత ఒక పీరియాడికల్ సినిమా రూపొందుతుంది. క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి ఓమ్ శివం అన్న టైటిల్ పరిశీలిస్తున్నారు. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2021 జనవరి నుంచి ప్రారంభం అవుతుందని సమాచారం.
ఈ సినిమాలతో పాటు గబ్బర్ సింగ్ కాంబినేషన్ మరోసారి రీపీటవుతుండటం విశేషం. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అలాగే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుండగా రాం తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు.
కాగా తాజా సమాచారం ప్రకారం నెక్స్ట్ సినిమా త్రివిక్రం దర్శకత్వంలోనే ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరి మద్య కథా చర్చలు పూర్తయ్యాయట. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని 2021 ద్వితియార్థం లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నాయని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారట. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ గా మిగలడంతో ఈ సారి బాక్సాఫీస్ వద్ద లెక్కలు సరి చేయాలని పవర్ స్టార్, త్రివిక్రం డిసైడయినట్టు చెప్పుకుంటున్నారు.