భారతదేశంలో ఆపిల్ యొక్క కీలక తయారీ భాగస్వామి అయిన విస్ట్రాన్ సంస్థలో వేలాది కార్మికులకు జీతాలు చెల్లించని నేపథ్యంలో ఉద్యోగులంత కార్యాలయం యొక్క కిటికీలు మరియు ఇతర ఆస్తులు, ఐఫోన్లు మరియు ఫ్యాక్టరీ పరికరాలను నాశనం చేసిన విషయం తెలిసిందే. ఆపిల్ తన కాంట్రాక్ట్ తయారీ భాగస్వామి విస్ట్రాన్ లో జరిగిన దాడులపై ఆపిల్ స్పందించింది. బెంగుళూర్ లోని విస్ట్రాన్ సరఫరాదారు ప్రవర్తనా నియమావళి బాగోలేదని తెలిపింది. సరైన పని గంటల నిర్వహణ ప్రక్రియలను అమలు చేయడంలో విస్ట్రాన్ విఫలమైందని ఐఫోన్ తయారీదారులు చెప్పారు. ఆ దాడులకు ప్రధాన కారణం అక్టోబర్ మరియు నవంబరులలో కొంతమంది కార్మికులకు జీతం చెల్లింపులో ఆలస్యం వల్లే ఈ సమస్య వచ్చిందని ఆపిల్ తెలిపింది.
అనంతరం వారి దృష్టి ఎప్పుడు వారి సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరని గౌరవంగా చూసుకుంటాం అని, ఈ ఘటన వారిని ఎంతో నిరాశకు గురిచేసిందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. భారతదేశంలో హ్యాండ్సెట్లను సంస్థలను స్థాపించడం వల్ల స్మార్ట్ఫోన్ విక్రేతలు దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం విధిస్తున్న సుమారు 20% దిగుమతి సుంకం వెసులుబాటు ఉంది. కనుక భారతీయ కార్మికులకు నష్టం కలుగకుండ సంస్థలు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని పలు పత్రికలు పేర్కొన్నాయి.
ఇటు విస్ట్రాన్ కూడా తన ప్లాంట్లో కొంతమంది కార్మికులకు సరైన వేతనం ఇవ్వలేదని అంగీకరించింది. ఈ సంస్థ యొక్క ఇండియా వ్యాపారాన్ని పర్యవేక్షించిన ఒక ఉన్నత ఎగ్జిక్యూటివ్ ను తొలగిస్తున్నట్లు కూడా ఇది ప్రకటించింది. కొన్ని ప్రక్రియలను మెరుగుపరుస్తున్నామని, ఈ సమస్యలు మళ్లీ జరగకుండా చూసుకోవడానికి మా బృందాలను పునర్నిర్మించామని తైవానీస్ సంస్థ తెలిపింది. కార్మికుల కోసం ఉద్యోగుల సహాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామని, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ మరియు ఇంగ్లీషులలో 24 గంటల గ్రీవెన్స్ హాట్లైన్ను కూడా ఏర్పాటు చేసామని ఏవైనా సమస్యలను తెలపవచ్చని సూచించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?