Work From Home: కరోనా పుణ్యమాని ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు కుదేలు అయ్యాయి. మిగిలిన కొన్ని ప్రత్యామ్నాయాల బాట పట్టాయి. అందులో నుండి పుట్టిందే ఈ వర్క్ ప్రమ్ హోం అనే పధ్ధతి. ఒకప్పుడు ఈ వెసులుబాటు ఉండేది కాదు. ఉద్యోగులు అడిగినా ఇచ్చేవారు కాదు. ఇలాంటి వాటికి కంపెనీలు ససేమిరా అనేవి. కానీ ఇపుడు వేరే దారిలేకే ఈ విధానాన్ని అవలంబించాయి. అయితే దీని వలన నష్టం కంటే సదరు సంస్థలకు అధిక లాభాలే మిగిల్చాయి. ఉద్యోగుల పని గంటలు మారాయి. అదెలాగో తెలియాలంటే మీ చుట్టూ పనిచేస్తున్న వారిని అడిగితే వారే చెబుతారు.
Apple Tea: యాపిల్ టీ టెస్ట్ చేశారా..!? ఈ అద్భుత ప్రయోజనాలు బోనస్..!!
వర్క్ ఫ్రమ్ హోం ఎంతవరకు?
దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి ఈ విధానంలోనే ఉద్యోగులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇక సెకండ్ వేవ్ అనంతరం ఇది మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఒమిక్రాన్ దానికి చెక్ పెట్టింది. నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశం లేకపోలేదు. ఈ వేరియంట్ ప్రభావం ప్రస్తుతం యాపిల్ వంటి కంపెనీలపై కూడా తీవ్రంగా పడింది. ఇంతకు ముందు ఫిబ్రవరి 1, 2022 నుంచి ఉద్యోగులు ఆఫీసుకు రావాలని యాపిల్ కంపెనీ ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
Apple: ఆపిల్స్ తింటున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోవాలి..!!
బోనస్ మాటేమిటి?
ఇంటి నుంచి పని విధానానికి యాపిల్ బోనస్ గట్టిగానే ప్రకటించింది. తన సంస్థ ఉద్యోగికి సుమారు 1000 డాలర్లు అనగా… రూ.76వేలకు పైగా అదనంగా చెల్లించనున్నట్లు తాజాగా పేర్కొంది. ఉద్యోగుల భద్రతా దృష్ట్యా మరికొన్నాళ్లు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా యాపిల్ తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న సదరు కంపెనీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.