ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్ -2, గ్రూప్ -3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో పలు మార్పులు చేశారు. గ్రుప్ – 2, గ్రూప్ – 3 ఉద్యోగాల నియామకానికి ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ, ఏపి సాంకేతిక విద్యామండలి నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూప్ – 2, గ్రూప్ – 3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదని అడ్ హక్ నిబంధనలు జారీ చేశారు.

డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా గ్రూప్ – 2, గ్రూప్ – 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారు అందరూ సీపీటీ పాస్ కావాల్సిందే. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. వంద మార్కులకు గానూ సీపీటీ నిర్వహించనున్నట్లు పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కంప్యూటర్లు, డీజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే ఈ గ్రూప్ -1 ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవని ఉత్తర్వులో తెలియజేశారు.
జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏటవుద్ది.. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుద్ది – కొడాలి