నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం.. ఇల వైకుంఠపురంగా విలసిల్లుతున్న తిరుమల..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఎస్ ఆర్.టీ.సి ద్వారా త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెడతామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.
పవిత్రమైన తిరుమల కొండను ‘జీరో కార్బన్ ఎమిషన్ జోన్’గా చేయాలనే లక్ష్యంతో డీజిల్ వాహనాల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది.డీజిల్ వాహనాల వలన కాలుష్యం పెరుగుతోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించాలనే నెపంతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తుంది.
తిరుమల కొండపై ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టిటిడి చేసిన అభ్యర్థనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం ప్రారంభ దశలో సుమారు 100 నుండి 150 బస్సులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సర్వీసులోకి తీసుకువస్తుందని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజురోజు పెరుగుతుంది.
ప్రభుత్వాలు ఇస్తున్న మద్దతు కారణంగా వాహన తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.