ప్రస్తుతం కరోనా వైరస్ రాకతో ఎంతో మంది ఉద్యోగులు రోడ్డున్న పడ్డారు. ఈ సమయంలో ఉద్యోగాలు పోయిన వారు, యువత ఉద్యోగాలకోసం ఎంతో శ్రమ పడుతున్నారు. చిన్నా చితన ఉద్యోగాలు చేయడానికైనా రెడీ అవుతున్నారు. ఈ సమయంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఏపీ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ ఎస్ డీసీ) ఒక శుభవార్త చెబుతోంది.
ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ ఎస్ డీసీ)కి ఉంది. అయితే కొత్తగా ఏపీఎస్ ఎస్ డీసీ మరో ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ప్రముఖ మొబైల్ పేమెంట్ సంస్థ అయిన ఫోన్ పే లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టినట్లు తెలిపింది. దీనికోసం ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనతో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.
ఈ కొత్త ప్రకటనతో 75 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీఎస్ ఎస్ డీసీ తెలిపింది. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులని పేర్కొంది. అలాగే ఈ జాబ్ చేయాలని అనుకున్న వారికి బైక్ పక్కగా ఉండాలని తెలిపింది. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాల్సిందే అని పేర్కొంది. ఆసక్తి ఉన్న వారు నవంబర్ 25 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది.
ఈ జాబ్ కు విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొంది. జీతం విషయానికి వస్తే.. 11,500+PF+ఇన్సూరెన్స్+ఇన్సెంటీవ్స్(రూ. 3000-రూ. 5,000) ఉంటాయని తెలిపింది. సేల్స్ విభాగంలో కనీసం ఆరు నెలలు పని చేసిన అనుభవం ఉండాలని తెలిపింది. అయితే ఇవి జిల్లాల వారిగా ఖాళీల ఉన్నాయి. మీకు గాని ఆసక్తి ఉంటే ఒక సారి నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి. ఇష్టం అయితే అప్లై చేసేయండి.