(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తానా వేడుకలకు హజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆప్తా ఎగ్జిక్యూటివ్ బాడీ మర్యాదపూర్వకంగా కలిసింది. 2020 ఆప్తా నేషనల్ కన్వెన్షన్కి వారు పవన్ను ఆహ్వానించారు. వారి ఆహ్వానానికి పవన్ సుముకత వ్యక్తం చేశారు.
పవన్కళ్యాణ్ కలిసిన వారిలో ఆప్తా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీ నటరాజు ఇల్లూరి, బోర్డు చైర్ కిరణ్ పల్లా, బోర్డు డైరెక్టర్ శ్రీధర్ నిశంకరరరావు , వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మన్నెం, ఇండియా ఆపరేషన్స్ చైర్ మధు దాసరి, కాపిటల్ రీజియన్ శ్రీ ఆర్విపి సునీల్ నందముడి, పూర్వ ప్రెసిడెంట్ వెంకట్ చలమలశెట్టి , పూర్వ బోర్డు డైరెక్టర్ విజయ్ గుడిసేవ తదితరులు ఉన్నారు.