Aranya : ‘లీడర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసిన దగ్గుబాటి రానా… తర్వాత కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే ఎప్పటికప్పుడు తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు. ఇక తనలోని టాలెంట్ మొత్తం ‘బాహుబలి’ చిత్రం ద్వారా బయటపడింది. దానికి ముందు కూడా రానా కొన్ని అద్భుతమైన పర్ఫార్మెన్స్ లు ఇచ్చాడు. బాలీవుడ్ లో కూడా రానా సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు పూర్తిగా అటవీ నేపథ్యంలో ఉండే ‘అరణ్య’ సినిమా చేశాడు రానా. ఈ చిత్రం ఈ శుక్రువారం విడుదలకు సిద్ధమైంది ఈ చిత్రం లో ఏనుగులు-ప్రకృతి-జీవ వైవిధ్యం గురించి విశేషంగా చర్చించబడింది. ఎంతో సహజంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం రానా బాగా కష్టపడ్డాడు. ‘బాహుబలి’ సినిమా ని మించి ఈ సినిమాకి ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పాడంటే… పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
థాయిలాండ్ అడవుల్లో పదుల సంఖ్యలో ఏనుగుల మధ్య ఈ చిత్రం చిత్రీకరణ జరగడం గమనార్హం. అయితే షూటింగ్ మధ్యలోనే రానాకు ఆరోగ్యం బాగోలేదు అన్న సంగతి తెలిసిందే. అతనికి 70% కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు చెప్పారు. అతను బ్రతికే అవకాశాలు కూడా తక్కువ అని వారు వెల్లడించడం జరిగింది. అయితే చివరికి రానా కోలుకొని బయట పడ్డాడు. ఇక ఈ చిత్రం దర్శకుడు ఇలా రానా కోసం చాలా ఏళ్ళు వెయిట్ చేసినట్టు వెల్లడించాడు.
ఇక ట్రైనర్స్ ఆధ్వర్యంలో థాయిలాండ్ లో 15 రోజుల పాటు ఏనుగుల మధ్య ఉండి వాటిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించాడు. అప్పుడు చాలా భయం వేసింది అని… అలాగే తనకు అలవాటు పడ్డా… ఎప్పుడైనా అవి అదుపు తప్పుతాయేమో అన్న భయం కూడా ఉండేదని…. అందుకే ఎప్పుడూ అరటిపండు, బెల్లం ముక్క పెట్టుకుని తిరుగుతుండేవాడినని రానా తెలిపాడు.
అయితే ఒకరోజు తన జేబులో ఉన్న అరటిపండు ఉన్నట్టుండి కొద్దిగా బయటకు కనిపించిందని… దాంతో తన చాలా అరటి పండ్లు ఉన్నయేమో అనుకుని ఒక్కసారిగా ఏనుగులన్నీ తన వైపు దూసుకొచ్చాయని.. అప్పుడు వణికిపోయానని.. సమయానికి శిక్షకులు వచ్చి వాటిని అదుపు చేయడంతో పెద్ద ముప్పు తప్పిందని రానా తెలిపాడు. ‘అరణ్య’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.