Archeological Survey: మన పూర్వికులు అంటూ ఉంటారు, ‘ఎవరో వచ్చారు. మనకు బట్ట కట్టడం నేర్పారు. తిండి తినడం బోధించారు. పంటలు పండించడంలో శిక్షణ ఇచ్చారు. అక్షర జ్ఞానం ప్రసాదించారు. కళలను పరిచయం చేశారు. విందూ వినోదాల రుచి చూపించారు. మొత్తంగా మన బతుకులనే మార్చేశారు’ అని. సరిగ్గా చెప్పాలంటే ఈ మార్పు కేవలం గత వంద సంవత్సరాల నుంచే మొదలయ్యింది.
బ్రిటిషర్ల పాలనా సమయంలో ఎన్నో హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. వారికి భయపడి కొందరు అయితే దేవాలయాలను అలాగే వాటి ప్రాముఖ్యతను కాపాడుకోవడానికి అప్పటికప్పుడు కొన్ని కొన్ని ఆలయాల నిర్మాణాలను మార్చారు. మూల విరాటుడు ఉన్న గర్భ గుడిని ఆనవాలు కట్టడాలు కట్టి వారి నుంచి ఆలయాలను కాపాడేవారు. ఇటువంటి సంఘటనలు మన చరిత్రలో చాలానే ఉన్నాయి.
తాజాగా భారతీయ పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలలో 11వ శతాబ్దంలో నిర్మించిన ఆలయంగా భావిస్తున్న ఓ జైన దేవాలయాన్ని కనుగొన్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో చోటు చేసుకుంది. భారతీయ పురావస్తు శాఖ అధికారులు జనవరి 20వ తేదీన ఇక్కడ జైన్ దేవాయలం ఉన్నట్టు గుర్తించడంతో తవ్వకాలు చేపట్టారు. అధికారులు చేపట్టిన ఈ తవ్వకాల్లో బయటపడిన జైన దేవాలయం హోసల రాజుల కాలానికి చెందినది.
మన దక్షిణ భారతదేశంలో ఉన్న కర్ణాటక ను 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు హోసల రాజులు పరిపాలించారు. ఈ తవ్వకాలను, అలాగే ఆలయం మీద జరుగుతున్న పరిశోధనను భారతీయ పురావస్తు శాఖ రీజనల్ డైరెక్టర్ జీ మహేశ్వరి పర్యవేక్షణలో జరిగాయి. అలాగే శివకాంత్ బజ్ పాల్ అనే బెంగళూరు సర్కిల్ సూపరిండెంట్ ఆర్కియాలజిస్ట్ ఈ పరిశోధనను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?