ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్ కోసం అభిమానులు.. ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా radhe shyam ని కృష్ణం రాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాతలు కృష్ణం రాజు కూతురు ప్రశీద.. వంశీ.. ప్రమోద్ కాగా దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. radhe shyam పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
కాగా prabhas రాధే శ్యామ్ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. యంగ్ రెబల్ స్టార్ prabhas తో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు కలిసి స్క్రీన్ మీద మరోసారి కనిపించబోతుండటం తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. radhe shyam లో కృష్ణంరాజు ఓ కీలక పాత్రను పోషించిన విషయాన్ని తాజాగా ఆయనే వెల్లడించారు. ఈ సినిమాలో కృష్ణంరాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో నటించగా రీసెంట్ గా తన పాత్ర కి సంబంధించిన షూటింగ్ ని కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం radhe shyam షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.
సమ్మర్ కానుక ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. అయితే radhe shyam మొదలై రెండేళ్ళు అవుతోంది. ఇదే ఫ్యాన్స్ లో ఉన్న పెద్ద డిసప్పాయింట్మెంట్. ఇదే అనుకుంటే రాధే శ్యామ్ టీం టీజర్ రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇప్పటికే రాధే శ్యామ్ నుంచి సరిగ్గా అప్డేట్స్ ఇవ్వడం లేదని టీం మీద గుర్రుగా ఉన్న అభిమానులు టీజర్ విషయంలో రోజు రోజు కి ట్రోల్ చేయడం ఎక్కువ చేస్తున్నారట. అంతేకాదు ఈ నెల 26 న గనక రాధే శ్యామ్ టీజర్ రాకపోతే ఇక ప్రభాస్ అభిమానులను ఆపడం ఎవరి వల్లా కాదని అంటున్నారు.