చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసే పని లో ఉన్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమాని త్వరగా ముగుంచాలనే ప్లాన్ తో గ్యాప్ లేకుండా షెడ్యూల్ ప్లాన్ చేశాడు koratala siva. ఈ రెండు నెలలలో సినిమాకి అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకులలోకి తీసుకు రావాలని ఇప్పటికే మేకర్స్ డిసైడయ్యారు.
ఈ సినిమా తర్వాత మళయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేయబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను తని ఒరువన్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ – ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై రామ్ చరణ్ – ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇక ఇప్పటికే lucifer సినిమాని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మోహన్ రాజా మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ రెడీ చేశారని.. ఈ స్క్రిప్ట్ మెగాస్టార్ ని బాగా ఇంప్రెస్ చేయడం తో త్వరలో lucifer ని సెట్స్ మీదకి వెళ్ళేందుకు ప్లాన్ చేయమని చెప్పారట.
అయితే ‘ lucifer’ ఒరిజినల్ వెర్షన్ లో రెండు ముఖ్యమైన పాత్రలకు తెలుగులో ఎవరిని తీసుకోవాలన్న విషయం లో మేకర్స్ పలువురు పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి హీరోకి సిస్టర్ రోల్ కాగా – మరొకటి హీరో కి అండగా ఉండే ఒక షార్ప్ షూటర్ రోల్. గాడ్సేలో సత్యదేవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసి షూటర్ పాత్రకు సరిపొతాడానుకున్న చిరంజీవి ఈ సినిమాలో ఆ పాత్రని సత్యదేవ్ తో చేయించాలని డిసైడయ్యారట. రీసెంట్ గా ఇందుకు సంబంధించిన న్యూస్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక మరొక పాత్రలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి ని తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మెగాస్టార్ సినిమాలో ఆయనకు సమానంగా వాళ్లిద్దరూ ఆ పాత్రలను మెప్పించగలరా అని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే priyamani నేషనల్ అవార్డ్ అందుకొని గొప్ప నటిగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం రానా తో విరాట పర్వం, వెంకటేష్ తో నారప్ప సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తోంది priyamani. ఇక ఇటీవల కాలంలో సత్యదేవ్ కూడా తన నటనతో పలువురు ప్రముఖులను మెప్పిస్తున్నాడు. కాబట్టి ఈ ఇద్దరికి లూసీఫర్ లో అవకాశం దక్కొచ్చన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.