బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ కేసు యావత్ సినీ రంగంలో కలకలం రేపుతూ, రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే.. సుశాంత్ సింగ్ మరణం పై గత కొన్ని రోజులుగా అభిమానులు, కొంత మంది సెలబ్రిటీలు బాలీవుడ్పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక్కడున్న బంధుప్రీతిపై మండిపడుతున్నారు. దీనికి కొంత మంది బడా నిర్మాతలు, దర్శకులు, నటులు కారణమని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కంగన రనౌత్ కూడా బాలీవుడ్ లో వున్న నెపోటిజమ్పై సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది.
అంతే కాకుండా సుశాంత్ సింగ్ మరణానికి కారణం రియా చక్రవర్తి అని పరోక్షంగా ఆరోపించింది.. ఒక కంగనా అనే కాదు ఈ విషయంలో అందరూ రియా చక్రవర్తిని దోషిగా చూస్తున్న సమయంలో రియాకు అండగా నిలిచారు కొందరు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్.. వారిలో నటి విద్యా బాలన్. తాప్సీ పన్నూ, స్వరా భాస్కర్, కుబ్రా సైట్, లక్ష్మి మంచు, చిత్రనిర్మాత అనుభావ్ సిన్హా వంటి నటులు రియాకు అనుకూలంగా మాట్లాడారు. మీడియా చేస్తున్న అతిని తీవ్రంగా తప్పుబట్టారు కూడా.. ఇక ఇన్ని రోజులైన సుశాంత్ సింగ్ మరణం వెనుక అసలు కారణం ఏంటన్న రహస్యం బయటపడటం లేదు.
కాగా గత రెండు రోజుల నుంచి ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు విచారిస్తున్నా, ఆ విచారణలో ఎలాంటి విషయాలు చెప్పడం లేదని పైగా ఆమె అరెస్ట్ అవడానికే సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకు సుశాంత్ మరణం విషయంలో రియా పాత్ర ఎంత అనే విషయాన్ని నిర్ధారించకుండా రియానే దోషిగా అనుమానించడం వెనక ఉన్న అసలు కారణం ఇప్పటి వరకు బయటకు పొక్కలేదు.. అయితే ఈ కేసును తప్పుదారి పట్టించేందుకే రియాను పావుగా వాడుకుంటున్నారనే అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయట.
దీనికి తగ్గట్టుగా రియా లాయర్ రియా అమాయకురాలు అని అంటున్నారు. ఒక వేళ రియాకు ఈ కేసుతో సంబంధం లేనప్పుడు ఆమెను ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ఆలోచించే వారు కూడా లేకపోలేదు.. ఇదివరకే సీబీఐ ఈడీఎన్.సీ.బీ కేసుల్లో ఇరుకున్న రియా ఇంత వరకు ముందస్తు బెయిల్ కోసం ఎందుకు దరఖాస్తు చేయలేదు. బయట కంటే జైల్లోనే సేఫ్ గా ఉండొచ్చని ఆమె అనుకుంటుందేమో అని చర్చించుకుంటున్నారట. అంతే కాకుండా రియా నోరు తెరిస్తే ఈ మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రియాను వాడుకుని సుశాంత్ ను ఎవరైనా బలిపశువును చేశారా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.