అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అన్న సినిమా లో నటిస్తుండగా రీసెంట్ గా ఈ సినిమా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేశారు. ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మీద ఇప్పటికే అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ బాగా క్రేజ్ నెలకొంది. ఇక ఈ త్వరలో చైతూ విక్రం కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న థ్యాంక్యూ అన్న సినిమాలో నటించబోతున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించబోతున్నాడు.
గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయున్ గా నటించబోతుందని తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన రానుందని అంటున్నారు. కాగా చైతు తమ్ముడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్ని వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ అండ్ సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. అఖిల్ – పూజ ల జంట స్క్రీన్ మీద చేసే రొమాన్స్ యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటోంది. అయితే ఇప్పుడు అక్కినేని అన్నదములిద్దరు కాస్త డిసప్పాయింట్మెంట్ లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు కారణం చైతూ లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ థియోటర్ రిలీజ్ అనుకుంటే ఇప్పట్లో అది కుదిరిరేలా లేదని అంటున్నారు. మంచి ఆఫర్ వస్తే ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.