ఇటీవల సీఎం జగన్ మంత్రుల పనితీరు విషయంలో సీక్రెట్ సర్వే ఒకటి చేయించినట్లు టాక్. ఈ నేపథ్యంలో చాలా మంది మంత్రుల పనితీరు విషయంలో ప్రజల నుండి నెగటివ్ రెస్పాండ్ వచ్చినట్లు గుర్తించడం జరిగిందట. ముఖ్యంగా సచివాలయానికి కూడా చాలా మంది మంత్రులు రాకుండా ఎవరికి వారు తమ వ్యక్తిగత పనులలో మునిగి తేలుతున్నట్లు విషయం బయటపడిందట.
ఇదిలా ఉంటే మాత్రం ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పనితీరు విషయంలో మాత్రం జగన్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారట. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చే విషయం లో మేకపాటి గౌతం రెడ్డి వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలోకి వచ్చిన కొత్త పరిశ్రమలు అతి తక్కువ టైమ్ లోనే ఎక్కువగా ఉండటంతో జగన్.. పారిశ్రామిక శాఖ మంత్రి పనితీరుపై సంతృప్తి చెందినట్లు సర్వేలో కూడా తేలినట్లు వైసీపీ పార్టీలో టాక్.
ముఖ్యంగా ఎక్కడ ఉన్నా గాని తన శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతూ మరోపక్క పెట్టుబడులు తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని చాలా పారిశ్రామిక కంపెనీలను రాష్ట్రంలోకి వచ్చేలా వ్యవహరించడంతో… గౌతమ్ రెడ్డి విషయంలో జగన్ ఫుల్ సంతోషంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మిగిలిన మంత్రులు కొంతమంది ఎప్పటిలాగానే వ్యవహరిస్తుండగా మరికొంతమంది పనితీరు అసలు బాగోలేక పోవటంతో వారికి సంబంధించిన నివేదికలు తెప్పించుకుని తప్పించడానికి జగన్ పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్. ఈ క్రమంలో లోనే ఓ కీలక నిర్ణయం వైసీపీ హైకమాండ్ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ట్రై చెయ్ అని మంత్రులను పూర్తిగా పక్కన పెట్టే విధంగా జగన్ రెడీ అటూన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ప్రస్తుత పరిణామాలు మాత్రం వైసిపి కేడర్లో టెన్షన్ పుట్టిస్తున్న నెక్స్ట్ ఎవరికీ జగన్ అవకాశం ఇస్తారు ఎవరిని పికేస్తారు అనే దాని విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.