దేశంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన సుమారు 850 ఫార్మసీ కళాశాలల్లో ఎం ఫార్మసీ లో ప్రవేశానికి జీప్యాట్ స్కోర్ తప్పనిసరి..! బి ఫార్మసీ విద్యార్థులు ఎంఫార్మసీ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ డిఏ) నిర్వహించే జీప్యాట్-2021 ప్రకటన విడుదల చేసింది..! జీప్యాట్ లో ఉతీర్ణత సాధిస్తే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ కళాశాలలో ఎంఫార్మసీ సీటుతో పాటు చదివే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాటు ప్రతి నెల రూ.12400 స్కాలర్ షిప్ కూడా అందిస్తుంది.. ఎం ఫార్మసీ తర్వాత పీహెచ్డీ లో చేరడానికి కూడా ఈ స్కోర్ ఉపయోగపడుతుంది.. మరిన్ని వివరాలు ఇలా..
అర్హతలు : బి ఫార్మసీ ఉత్తీర్ణత. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
పరీక్షా విధానం : జీప్యాట్ పరీక్షను కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 25 ప్రశ్నలు ఉండగా ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం గా 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ. 2000/-
దరఖాస్తులకు చివరి తేదీ : 22/1/2021
వెబ్ సైట్ : https://gpat.nta.nic.in
పరీక్షా తేదీ :22,27 ఫిబ్రవరి 2021