సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో ఈ 27 వ సినిమాకి గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ..14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు, ఎస్ ఎస్ థమన్ కాంబినేషన్ 7 ఏళ్ళ తర్వాత రిపీటవుతుంది. అందుకే థమన్ ఈ సినిమాకి ది బెస్ట్ ఆడియో ఇవ్వాలని కసితో ఉన్నాడు.
ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. యూనివర్సల్ అప్పీల్ ఉన్న బ్యాంక్ లో జరుగుతున్న మోసాలు, నేరాలు అన్న కాన్సెప్ట్ ని ఈ సినిమాకి మేయిన్ థీం గా ఎంచుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని, మరో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ నటిస్తుందని.. వార్తలు వస్తునే ఉన్నాయి. త్వరలో ఈ విషయం వెల్లడి కానుందని సమాచారం.
ఇక ఆగస్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సర్కారు వారి పాట నుంచి ఫ్యాన్స్ కి భారీ గిఫ్ట్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తాజాగా థమన్ వెల్లడించడంతో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఆగస్టు 9 న మహేష్ వాయిస్ మెసేజ్ తో పాటు టైటిల్ ట్రాక్ విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తుండగా థమన్ దాదాపు కన్ఫర్మ్ చేసినట్టే. మరో మూడు రోజుల్లో రెడీగా ఉన్నారా అంటూ మహేష్ బాబు పిక్ ని షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలవబోతుందని అంటున్నారు.
#3daystogo ready ga Unnnraa !! ?? pic.twitter.com/Bosk9TS8ZR
— thaman S (@MusicThaman) August 6, 2020