బాలీవుడ్ ను ప్రస్తుతం డ్రగ్స్ కుంభకోణం ఊపిస్తోన్న సంగతి తెల్సిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం అనేక అనుమానాలకు తావివ్వడంతో కేంద్రం ఈ కేసును కేంద్రీయ దర్యాప్తు సంస్థకు అప్పగించిన సంగతి తెల్సిందే.
ఎప్పుడైతే సీబీఐ ఈ విషయంలోకి వచ్చిందో మొత్తం కేసు స్వరూపమే మారిపోయింది. ఈ ఆత్మహత్య వ్యవహారంలోకి డ్రగ్స్ ఇష్యూ వచ్చి చేరింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని నార్కోటిక్స్ బృందం అదుపులోకి తీసుకుని విచారించింది. అయితే ఆమె మొత్తంగా 25 సెలబ్రిటీల పేర్లను వెల్లడించిన సంగతి తెల్సిందే. అందులో దీపికా, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ లకు నార్కోటిక్స్ అధికారులు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు.
రకుల్ ప్రీత్ ఇప్పటికే ఈ కేసులో ముంబై చేరుకుంది. ఈరోజు నార్కోటిక్స్ అధికారుల ముందు హాజరవుతుంది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. ఇదిలా ఉంటే కొంత మంది కథానాయికలు ఇండస్ట్రీ తీరుతెన్నుల గురించి హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హాట్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. క్వాన్ అనే టాలెంట్ ఏజెన్సీ అధినేత అనిర్బన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఏదో ప్రాజెక్ట్ విషయమై తాను అనిర్బన్ ను కలిశానని, అయితే నన్ను పై నుండి కింద వరకూ చూస్తున్నాడు. ఏమైంది సర్, నా డ్రెస్ ఏమైనా బాగోలేదా అని అడిగాను. అతను వెంటనే నీ బ్రెస్ట్స్ నిజమైనవేనా, అవి నేను తాకొచ్చా అని అడిగాడు. అంత డైరెక్ట్ గా అడిగేసరికి నిర్ఘాంతపోయా. అక్కడి నుండి వెంటనే వచ్చేసా. అయినా నా బ్రెస్ట్స్ నిజమైతే అతనికేంటి, ఫేక్ అయితే అతనికేంటి అని ప్రశ్నించింది షెర్లిన్ చోప్రా. అలాగే డ్రగ్స్ విషయంలో స్పందిస్తూ నార్కోటిక్స్ అధికారులు పనితీరును ప్రశంసించింది. ఈ దెబ్బతో బాలీవుడ్ లో డ్రగ్స్ కుళ్ళు మొత్తం వదిలిపోతుందని ఆమె ఆశించింది.