బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న “కొంటె రాక్షసుడు-మంచి మనుషులు” గేమ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. రాక్షసుల టీంలో అవినాష్, మెహబూబ్, అరియానా రాక్షసుల మాదిరిగా రెచ్చిపోతున్నారు. మంచి మనుషుల టీం సభ్యులకి చుక్కలు చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా హౌస్ లో ముందు నుండి అవినాష్ కి కొంచెం క్లోజ్ గా ఉంటున్న ఫిమేల్ కంటెస్టెంట్ అరియానా. అయితే ఈ టాస్క్ లో అవినాష్ మోనాల్ బెడ్ పై ఆమెతో కూర్చుని మాట్లాడుతూ చేసిన సంభాషణ పక్కనే ఉన్న అరియానా చూసి తెగ ఫీల్ అయిపోయింది. ఈ దారుణాన్ని రొమాన్స్ చూడలేము అన్నట్టు డైలాగ్ వేసి పక్కకి వెళ్ళిపోయింది.
అయితే ఇదే సందర్భంలో అవినాష్…అరియానా ని పిలిచి పక్కనే కూర్చుమన్నాడు దానికి ఆమె ఏమి స్పందించ కుండా వెళ్ళిపోయింది. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో అఖిల్ ఈ సన్నివేశాన్ని చూసి కచ్చితంగా ఫీల్ అవుతాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే మోనాల్ ఎక్కడ ఉంటే అఖిల్ మనసు అక్కడ ఉంటుంది కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తం మీద అటు అరియనా తనకి క్లోజ్ గా ఉన్నా అవినాష్ వేరే వ్యక్తి దగ్గర ఉండటం విషయంలో ఎంత ఫీల్ అయిందో, ఇదే సందర్భంలో అఖిల్ కూడా మోనల్ విషయంలో బాధపడినట్లు.. ఈ పరిణామాలు హౌస్ లో సరికొత్త వాతావరణం క్రియేట్ చేసే అవకాశం ఉందని బయట జనాలు చెప్పుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?