ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకూ పెరిగిపోతోంది. దేశంలో రోజుకు దాదాపు 40 వేలకు పైన కేసులు నమోదవుతున్నాయి. ఇక దాదాపుగా 500కు పైన మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారిని ఆపలేకపోతున్నారు.
సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలకు కూడా కరోనా సోకుతోంది. ఇటీవలే అమితాబ్ బచ్చన్ మరియు అతని కుటుంబానికి కరోనా సోకిన విషయం తెల్సిందే. ప్రస్తుతం వారు ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటున్నట్లు తెలిపి తనతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళను టెస్ట్ చేయించుకోమని సూచించింది.