భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్ సి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఎన్ సీసీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. ఎన్ సీసీ స్పెషల్ ఏంటి స్కీం 49వ కోర్సు (ఏప్రిల్ 2021 ) ప్రకటన విడుదల చేసింది.. అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టుల ఖాళీలు, అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 55 పోస్టులు
1.ఎన్ సీసీ మెన్ : 50
(జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45 పోస్టులు, ప్రమాదం లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి – 5పోస్టులు)
2.ఎన్ సీసీ ఉమెన్ : 5
(జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 4 పోస్టులు, ప్రమాదం లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి – 1 పోస్టు)
అర్హతలు :
కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎన్ సీసీ లో “సీ” సర్టిఫికెట్ ఉండాలి. ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. ఎన్ సీసీ లో “సీ” సర్టిఫికెట్ అవసరం లేదు .
వయసు : 1-1 -2021 నాటికి 19 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. 1996 – 2002 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం:
స్క్రీనింగ్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసి చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్ బి ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ లను ఫేజ్-1, ఫేజ్-2 లలో జరుగుతుంది. ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ :30/12/2020.
దరఖాస్తులకు చివరి తేదీ : 28/1/2021.