టీచింగ్ ప్రొఫైల్ కోసం అభ్యర్థులను దేశవ్యాప్తంగా నియమించడానికి సీటెట్ పరీక్ష ద్వారా నియామకం జరుగుతుంది. టెట్ పరీక్ష నిర్వహించని రాష్ట్రాలు సీటెట్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తాయి.కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో నియామకానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 135 నగరాల్లో 20 భాషల్లో నిర్వహిస్తారు.
కరోనా ప్రభావంతో వాయిదాపడిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల మార్పు కోరుకునేవారు నవంబర్ 11 నుంచి 16 వరకు వెబ్సైట్లో మార్చుకోవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ సిబిఎస్ సి ఉన్నతాధికారులు తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా అన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి ఇటు కేంద్రంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాయిదా పడిన పరీక్షలను నిర్వహిస్తూ వస్తున్నాయి.కరోనా నేపథ్యంలో అభ్యర్థులు సౌలభ్యం కోసం మరికొన్ని పరీక్ష కేంద్రాలను పెంచినట్లు వెల్లడించార. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాలతో పాటు మరో 23 పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే అభ్యర్థులు వారి సౌలభ్యం మేరకు పరీక్ష కేంద్రాలను మార్చుకునే వారికోసం మరో అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలను మార్చుకోవాలనుకునే అభ్యర్థులు నవంబర్ 11 నుంచి 16 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ మేరకు అభ్యర్థులు www.ctet.nic.in వెబ్సైట్లో లాగిన్ పరీక్షా కేంద్రాలను నేర్చుకోవాల్సిందిగా వెల్లడించింది. అయితే ఈ సిటెట్ పరీక్ష దేశవ్యాప్తంగా 135 నగరాలలో జరగనుంది.