ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ట్విట్టర్ బాణం వదిలారు. దేశ రాజధానిలో పరిపాలన స్తంభింపజేయడం రాజద్రోహం కాదా అని ఆయన ప్రశ్నించారు. ‘కన్నయ్య కుమార్ రాజద్రోహానికి పాల్పడ్డారో లేదో తెలియదు కానీ, మోదీజీ ఢిల్లీలో పిల్లలు చదివే పాఠశాలలు పరిమితం చేస్తున్నారు. ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్, సిసిటివి కెమేరాలు అన్నిటినీ పరిమితం చేస్తున్నారు. దేశ రాజధానిలో పరిపాలన స్తంభిపజేస్తున్నారు. దీనిని రాజద్రోహం కాక ఏమంటారు’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
previous post
next post