మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై సీరియస్ వ్యాఖలు చేశారు. బుధవారం నాడు అసదుద్దీన్ ఉత్తరప్రదేశ్ పర్యటనలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూపీ రాకుండా తనని 12 సార్లు అడ్డుకోవటం జరిగిందని ఆరోపించారు.
అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా అడ్డుపడటం జరిగిందని దాదాపు ఇరవై ఎనిమిది సార్లు తనకి అనుమతి నిరాకరించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో కలిసి బరిలోకి దిగబోతోంది అని క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టబోతున్నట్లు, గ్రౌండ్ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు అంతా సెట్ చేసి బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అఖిలేష్ యాదవ్ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరోపక్క అసదుద్దీన్ మజ్లిస్ పార్టీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో విస్తరింపజేసే రీతిలో చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పోటీ చేసి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కో రాష్ట్రంలో అడుగు పెడుతూ పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.