Rishabh Pant : భారత స్టార్ స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన ప్రదర్శనతో ఇటీవలి కాలలోనే టీం ఇండియా లో ‘లెజెండ్’ అనే పేరుని సార్థకం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో, ఇంగ్లండ్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో అతను అటు బంతితో, ఇటు బ్యాటుతో విజృంభించాడు. టీం ఆపదలో ఉన్న ప్రతి సారి నేనున్నానంటూ ప్రతికూలతలు ఎదురొడ్డి నిలబడ్డాడు.
అయితే తాజాగా ఒక లైవ్ చాట్ లో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొద్ది వారాల క్రితం ముగిసిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో అశ్విన్ డీఆర్ఎస్ (DRS) కాల్స్ తీసుకునే విషయంలో తడబడ్డాడు. కోహ్లీని వికెట్లకు దూరంగా వెళుతున్నా బంతులకి కూడా ఎల్బిడబ్ల్యు కోసం DRS తీసుకోమని పురమాయించాడు. ఇక సీనియర్ ఆఫ్ స్పిన్నర్ చెప్పిన మాట విని కోహ్లీ రివ్యూ తీసుకోవడం…. భారత్ ఇలా చివరికి అనేక సార్లు రివ్యూలు కోల్పోవడం కూడా జరిగింది.
దీనిపై భారత్ కోచ్ రవిశాస్త్రి అసహనం కూడా వ్యక్తం చేసినట్లు అశ్విన్ తెలిపాడు. అయితే ఈ విషయంపై ప్రస్తావన వచ్చినప్పుడు అశ్విన్ మాట్లాడుతూ… “నాకు అటువంటి వికెట్ల పై వికెట్-కీపర్ నుండి చాలా సహకారం కావాలి. బంతి ఎంత ఎత్తు కి వెళ్తుంది, ఎంత ఎక్కువగా తిరుగుతుంది అన్న విషయంపై వికెట్-కీపర్ సరైన అవగాహన కల్పించాలి. రిషబ్ పంత్ ఆ పని చేయలేకపోవడం వల్లే ఈ తప్పిదాలు జరిగాయి” అంటూ యువ వికెట్ కీపర్ ను అశ్విన్ నిందించడం జరిగింది.
అయితే తర్వాత తను రిషబ్ పంత్ దగ్గరికి వెళ్లి, అతనిని పక్కకు తీసుకొని వెళ్లి రవిశాస్త్రి ఈ విషయంపై కోపంగా ఉన్నాడు మనిద్దరం దీనిపై చర్చించి వర్కవుట్ చేయాలని చెప్పినట్లు కూడా అశ్విన్ తెలిపాడు. కేవలం 20 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ రానున్న రోజుల్లో మరింత పరిణితి కనబరుస్తాడేమో చూడాలి.