ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతుంటే.. అసోంను మాత్రం మరో భయంకర వైరస్ వెంటాడుతోంది. అదే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ. దాన్నే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని కూడా అంటారు. ఇది మామూలు వైరస్ కాదు. దీని వల్ల ఇప్పటి వరకు 18 వేల పందులు మృతిచెందాయట. పందుల నుంచి ఇతర జంతువులకు ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో వేరే జంతువులు కూడా ఈ వైరస్ ధాటికి మృత్యువాతపడుతున్నాయి. అందులోనూ ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సోకితే డేంజర్ బెల్స్ మోగే ప్రమాదం ఉందని గ్రహించిన అసోం ప్రభుత్వం.. వెంటనే దిద్దుబాటు చర్యలను తీసుకుంటోంది.
అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 12 వేల పందులను చంపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఆయా పందుల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేందుకు సమాయత్తం అవుతోంది.
మొత్తం అసోంలోని 14 జిల్లాల్లో స్వైన్ ఫ్లూ ప్రభావం ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ముందుగా ఈ వైరస్ బయటపడింది. ఇప్పుడు శరవేగంగా విజృంభిస్తోంది.
ఈ వైరస్ ను ఆరోగ్యంగా ఉన్న జంతువులను వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. ఈ వైరస్ ఎక్కువగా పందుల్లోనే కనిపిస్తుండటంతో వాటిని వధిస్తే.. వైరస్ ను అరికట్టే అవకాశం ఉంటుందని.. పశువైద్య నిపుణులు చెబుతున్నారు.